అంజనీ పుత్ర ఆధ్వర్యంలో ఘనంగా అన్న దాన కార్యక్రమం.
అన్నదాతా సుఖీభవ అంటూ భక్తుల ఆశీర్వచనాలు.
మంచిర్యాల, 100 ఫీట్ రోడ్డు.
మంచిర్యాల వినాయక నవ రాత్రోత్సవాల్లో మొదటి రోజు న అన్న దానం 2000 వేల మందికి పైగా ఘనంగా నిర్వహించారు. ప్రజలు అన్నదాతా సుఖీభవ అంటూ భక్తుల ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా అంజనీ పుత్ర సంస్థ చైర్మెన్ గుర్రాల శ్రీధర్, మేనేజింగ్ డైరెక్టర్ పిల్లి రవి మాట్లాడుతూ అన్ని దానాల్లో అన్న దానం గొప్పదని. సామాజిక కార్యక్రమాలలో అంజనీ పుత్ర సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో అంజనీ పుత్ర అన్నదాన కార్యక్రమాలకు ప్రత్యేక స్థానం ఏర్పడింది. దాదాపు వినాయక ప్రతిమ ప్రతిష్ఠించిన ప్రతిచోటా అన్నదానం తప్పనిసరయింది. జనాభా సంఖ్యకు అనుగుణంగా భారీగానే అన్నదానం నిర్వహించారు.
ఈ కార్యక్రమం లో అంజనీ పుత్ర సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లుసూరినేనీ కిషన్, కాసర్ల సదాందం, డైరెక్టర్ లు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.





