Breaking News

మంచిర్యాల అభివృద్ధి విషయంలో బహిరంగ చర్చకు సిద్ధమనీ ప్రేమ్ సాగర్ రావు

22 Views

మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పాత్రికేయుల సమావేశం.

మంచిర్యాల నియోజకవర్గం.

అభివృద్ధి విషయంలో బిజెపి, బీఆర్ఎస్ పార్టీల నాయకులతో బహిరంగ చర్చకు సిద్ధమని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సవాల్ విసిరారు.

మంచిర్యాల పట్టణంలోని వారి నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గారు ఘాటుగా స్పందించారు.

రాబోయే ఎన్నికల్లో కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు  ఆశాభావం వ్యక్తం చేశారు.

మంచిర్యాల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి హైదరాబాద్ కు సరి సమానంగా నిలబెడతానని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు  అన్నారు..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని లేనటువంటి 400 మెగావాట్ల సబ్ స్టేషన్, మంచిర్యాల 220 మెగా వాట్లా సబ్ స్టేషన్ ను, లక్షెట్టిపేట్ లో,130 మెగా వాట్లా సబ్ స్టేషన్ ను, నస్పూర్ లో ఏర్పాటు చేసేందుకు అనుమతులు వచ్చాయని అన్నారు.

అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంది కాబట్టే నాపై కొందరు నాయకులు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. అభివృద్ధికి అడ్డుపడితే సహించేది లేదని ఘాటుగా విమర్శించారు. బతుకమ్మ కానుకగా మహిళలకు శ్రీ శక్తి భవనం నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపారు.

మంచిర్యాల పట్టణంలో శిథిలా వ్యవస్థలో ఉన్న బాయ్స్ హై స్కూల్, గర్ల్స్ హై స్కూల్ భవనాలను తొలగించి నూతన భవనాలు నిర్మిస్తామని అన్నారు.

మంచిర్యాల జిల్లాకు త్వరలోనే నవోదయ హై స్కూల్ మంజూరు అవుతుందని తెలిపారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు.

హాజీపూర్ మండలంలోని ముల్కల వద్ద నిర్మిస్తున్న ఇండస్ట్రియల్ హబ్ ద్వారా రెండు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు.

వచ్చే వినాయక చవితి సందర్భంగా వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ అందించి మున్సిపాలిటీ ద్వారా త్రాగునీరు, సానిటేషన్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలను ఎవరైనా ఇబ్బందులకు చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ప్రశాంత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని ప్రజలను కోరారు.

నాకు గత 20 రోజు అనారోగ్యానికి గురి కావడం జరిగింది.. నేను ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేసిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు , కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మహిళా నాయకురాలకు, కార్యకర్తలకు , అభిమానులకు పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ, తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *