Breaking News

పదవీ విరమణ పొందిన అధికారులను సన్మానించి,జ్ఞాపికలు అంద చేసిన డిసిపి

14 Views

రామగుండం పోలీస్ కమీషనరేట్

పదవీ విరమణ పొందిన అధికారులను సన్మానించి,జ్ఞాపికలు అంద చేసిన డిసిపి.

శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలి  : మంచిర్యాల డిసిపి భాస్కర్ ఐపిఎస్.,

పోలీస్ శాఖ నందు సుదీర్ఘ కాలం పాటు విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులను ఈరోజు రామగుండం పోలీస్ కమీషనర్  కార్యాలయం నందు ఏర్పాటు చేసిన పదవీ విరమణ కార్యక్రమంలో మంచిర్యాల డిసిపి భాస్కర్ ఐపిఎస్.,  పాల్గొని పదవీ విరమణ పొందుతున్న ముగ్గురు  పోలీసు అధికారులు, కుటుంబ సభ్యులతో  కలిసి శాలువా, పూలమాలతో సత్కరించి జ్ఞాపిక అందచేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈరోజు పదవీ విరమణ పొందిన అదనపు డిసిపి అడ్మిన్ సి.రాజు, 1991 సంవత్సరంలో పోలీసు డిపార్ట్మెంట్ లోకి ఆర్ ఎస్ఐ  గా ఎంపికై  అంచలంచలుగా పదోన్నతి పొంది కుటుంబ సభ్యుల సహకారంతో ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా సంఘవిద్రవశక్తులతో పోరాడి యాంటి ఎక్స్మిస్ట్ ఆపరేషన్ నందు విధులను నిర్వర్తించి, ప్రస్తుత పోలీసు వ్యవస్థ ప్రశాంతంగా కొనసాగడానికి కీలకపాత్రను పోషించి విజయవంతంగా పదవి విరమణ పొందడం జరిగింది. ఎన్.నరేష్ బాబు  ఇన్స్పెక్టర్ 1983  సంవత్సరంలో పోలీసు డిపార్ట్మెంట్ లోకి కానిస్టేబుల్ గా వచ్చి అంచలంచలుగా సర్వీసులోని 42 సంవత్సరముల 2 నెలలు  విధులను నిర్వర్తించడం జరిగింది. జే . సమ్మయ్య ఆర్ఎస్ఐ  ఇన్స్పెక్టర్ ,1984 సంవత్సరంలో పోలీసు డిపార్ట్మెంట్ లోకి కానిస్టేబుల్ గా వచ్చి అంచలంచలుగా సర్వీసులోని 41 సంవత్సరముల 6 నెలలు  విధులను నిర్వర్తించడం జరిగింది.

ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ…… గతంలో పోలీసు వ్యవస్థ అత్యంత క్లిష్ట పరిస్థితుల నందు సంఘవిద్రోహశక్తులతో పోరాడి కీలకంగా విధులను నిర్వర్తించి ప్రస్తుతం పోలీసు వ్యవస్థ ప్రశాంతంగా ఉండడానికి గల కారణమైన అధికారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. సుదీర్ఘ కాలం పాటు పోలీసు వ్యవస్థను సేవలందించి పదవీ విరమణ పొందుతున్నందుకు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలను పోలీసులు సక్రమంగా విధులను నిర్వర్తించడానికి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతగానో ఉంటుందని వారి తోడ్పాటు వల్లనే విధులను నిర్వర్తించి ఉన్నత స్థానాలకు ఎదగగలరని తెలియజేశారు. పదవి విరమణ చేసిన మీరు ఇకపై కుటుంబ సభ్యులతో  తమ శేష జీవితాన్ని ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఆనందంగా గడపాలని  సూచించారు. తమ ఆరోగ్యాల పట్ల తగు జాగ్రత్తలను తీసుకోవాలని కోరారు.  ఎటువంటి అవసరం ఉన్న కమీషనరేట్ పోలీసు వ్యవస్థ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చారు. పదవి విరమణ పొందిన అధికారులను ప్రభుత్వ వాహనంలో ఇంటి వరకు సాగనంపడం జరిగింది.

ఈ కార్యక్రమంలో 13 బెటాలియన్ కమాండెంట్ మూర్తి , స్పెషల్ బ్రాంచ్ ఎసిపి మల్లారెడ్డి , ట్రాఫిక్ ఎసిపి శ్రీనివాస్ ,  ఎఆర్ ఎసిపి ప్రతాప్, ఏఓ శ్రీనివాస్ ,  రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు  దామోదర్, మల్లేషం, శ్రీనివాస్, వామన మూర్తి , సూపరింటెండెంట్ లు ఇంద్ర సేనా రెడ్డి, సంధ్య, మనోజ్ కుమార్, సిసి హరీష్, రామగుండం పోలీస్ కమీషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు బోర్లా కుంట పోచలింగం, స్వామి, పదవి విరమణ అధికారుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *