ప్రాంతీయం

గొల్లపల్లి శివారులో పోలీసుల వాహన తనిఖీలు.

73 Views

ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి శివారు ప్రాంతంలో కామారెడ్డి సిరిసిల్ల ప్రధాన రహదారిపై ఎల్లారెడ్డిపేట ఎస్ ఐ లు రాహుల్ రెడ్డి,మలోతు తుకారాం నాయక్ ల ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు.
వాహనాలు నడిపే వారికి బ్రీత్ ఎనలైజర్ తో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేశారు.
ఈ సందర్భంగా ఎస్ ఐ లు వాహనదారులు మద్యం త్రాగి వాహనాలు నడుప రాదని, వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్,ఇన్సూరెన్స్,పొల్యూషన్ పత్రాల తోపాటు డ్రైవింగ్ లెసైన్సు తప్పకుండా కలిగి వుండాలని తెలిపారు.
ద్విచక్ర వాహన చోదకులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, ట్రిపుల్ డ్రైవింగ్ చేయరాదని,తల్లిదండ్రులు మైనర్లకు బైక్ ఇవ్వరాదని సూచించారు.
ఈ తనిఖీల్లో ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ కు చెందిన పలువురు పోలీస్ కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *