మంచిర్యాల జిల్లా.
యోగా టీచర్ నటీశ్వర్ ఆధ్వర్యంలో అంగన్వాడి స్కూల్లో యోగా కార్యక్రమం.
ఈరోజు మంచిర్యాల పట్టణం ఇందిరానగర్ అంగన్వాడి స్కూల్లో న్యాయవాది యోగా మాస్టర్ కొట్టే నటేశ్వర్ ఆధ్వర్యంలో యోగ నిర్వహించడం జరిగింది. అంగన్వాడి స్కూల్ పిల్లలకు మరియు వారి తల్లిదండ్రులకు 11వ అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా యోగ గురించి తెలుపుతూ యోగ చేయడం ద్వారా మనం మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉంటామని తెలియజేయడం జరిగింది. ఇందిరానగర్ అంగన్వాడి టీచర్స్ ఎ డబల్యు టి ఎం. విజయ మరియు జ్యోతి పాల్గొని పిల్లలు మరియు తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉండే విధంగా వారికి సరియైన సమయంలో మంచి ఆహారం మంచి ఆరోగ్యం ఉండే విధంగా గర్భిణీలకు మరియు పిల్లలకు మంచి ఆహారం మరియు పిల్లలకు వారి తల్లిదండ్రులకు సరైన సమయంలో టీకాలు వారి పట్ల ఆరోగ్యంగా ఉండే విధంగా చూసుకుంటున్నారు.
