మంచిర్యాల జిల్లా.
మంచిర్యాల అభివృద్ధి ప్రదాత ప్రేమ్ సాగర్ రావు గారి ఆలోచనలో భాగంగా మరొక అద్భుతాన్ని మంచిర్యాల ప్రజల ముందుకు తీసుకొచ్చారు.
మంచిర్యాల కార్పోరేషన్ పరిధిలోని మంచిర్యాల మార్కెట్ ఏరియాలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మరియు పవర్ సిస్టం.. అంతేకాకుండా సెంట్రల్ లైటింగ్, రోడ్ల పనుల నిర్మిణం కోసం 78 కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు ఈరోజు మంచిర్యాల మార్కెట్ ఏరియాలోని అర్చన టెక్స్ చౌరస్తా వద్ద,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రీ ఎనుముల రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చిత్ర పటాలకు పాలాభిషేకం చేసి, టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్న వ్యాపారస్తులు , కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.
ఈ కార్యక్రమంలో వ్యాపారస్తులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, విద్యార్థి నాయకులు, కార్యకర్తలు , తదితరులు పాల్గొన్నారు.
