ఏఐసీసీ, టీపిసిసి పిలుపు మేరకు.
మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు.
మంచిర్యాల నియోజకవర్గం.
లక్షెట్టీపేట్ మున్సిపాలిటీ పరిధిలో SPR గార్డెన్ లో మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సంస్థగత నిర్మాణ సన్నాహాక సమావేశం నిర్వహించారు.
ఈసందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారం లేకున్నా కాంగ్రెస్ పార్టీ జెండా భుజాల మీద మోసి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు.. కష్టపడ్డ ప్రతి నాయకుడికి, కార్యకర్తకి నేను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు .
ముందుగా వీర మరణం పొందిన ఆర్మీ జవాన్లు మరియు హల్గహాంలో ఉగ్రవాదుల దాడిలో అమరులైన భారత పౌరుల ఆత్మ శాంతి కావాలని రెండు నిమిషాల మౌనం పాటించడం జరిగింది.
ఈ సమావేశంలో మంచిర్యాల జిల్లా పిసిసి అబ్సర్వర్, తెలంగాణ ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి, పీసీసీ మెంబర్ చిన్నబ్బు రాంభోపాల్ , దండేపల్లి, లక్షెట్టీపేట్ మండలాల నాయకులు, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



