మంచిర్యాల జిల్లా
మంచిర్యాల జిల్లాలో బిజెపి జిల్లా కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు.
బీజేపీ ఆధ్వర్యంలో ఈరోజు మంచిర్యాల జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, సీనియర్ నాయకులు రఘునాథ్ వెరబెల్లి మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల కోసం చేసిన సేవలను గుర్తు చేసుకోవడం జరిగింది. అంబేద్కర్ ఆశయాలను అందరూ కొనసాగించాలని రఘునాథ్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అమిరిశెట్టి రాజ్ కుమార్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్, పెద్దపల్లి పురుషోత్తం, పురుషోత్తం జాజు, బోయిని హరికృష్ణ, బియ్యాల సతీష్ రావు, ఎంగందుల కృష్ణ మూర్తి, రాపర్తి వెంకటేశ్వర్లు, నాగుల రాజన్న, జోగుల శ్రీదేవి, మోతె సుజాత, కంకణాల సతీష్, ఆరేందుల శ్రీనివాస్, వైద్య శ్రీధర్, కాశెట్టి నాగేశ్వర్ రావు, దేవరకొండ వెంకన్న, ముదాం మల్లేష్, కెమెరా అర్జున్, తరుణ్ సింగ్ మరియు తదితరులు పాల్గొన్నారు.
