మంచిర్యాల జిల్లా.
అంబేద్కర్ ని అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది- సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు.
అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఇవాళ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు మరియు బీజేపీ నాయకులు రఘునాథ్ వెరబెల్లి పాల్గొని
నస్పూర్ పట్టణంలో సీసీసీ కార్నర్ వద్ద అంబేద్కర్ విగ్రహాన్ని శుద్ధి చేసి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ అంబేద్కర్ ని అడుగడుగునా అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అంబేద్కర్ అంత్యక్రియలు ఢిల్లీలో జరగనివ్వకుండా ముంబైకి వారి పార్థివదేహాన్ని తరలించి, ఆ తరలింపుకయ్యే విమాన ఛార్జీల బిల్లులు చెల్లించాలని అంబేద్కర్ సతీమణి గారికి బిల్లులు పింపిన నీచాతినీచమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. శ్యామా ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆలోచనా విధానాన్ని బలపరిచిన అంబేద్కర్ కు, ఆయన ఆలోచనలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం తగిన గౌరవం ఇస్తోంది. భావితరాలకు అంబేద్కర్ చరిత్ర తెలిసేలా పంచ తీర్థాలను ఏర్పాటు చేయడంతో పాటు, దళితుడైన రామ్ నాథ్ కోవింద్ ను, ఆదివాసీ బిడ్డ ద్రౌపది ముర్ము రాష్ట్రపతి చేసింది. అణగారిన వర్గాల్లో వెలుగులు నింపిన అంబేద్కర్ కు భారతరత్న కోసం బిజెపి కృషి చేసింది. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా 12 మంది దళితులకు, 27 మంది ఓబీసీలకు, 8 మంది మహిళలకు మోదీ ప్రభుత్వం తమ కేబినెట్ లో చోటు కల్పించింది. అంబేద్కర్ కలలను సాకారం చేస్తూ బడుగు బలహీన వర్గాల ప్రజలకు మోదీ ప్రభుత్వం అభివృద్ధిని పరిచయం చేసిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, దుర్గం అశోక్, కొయ్యల ఎమాజీ, పెద్దపల్లి పురుషోత్తం, అమరరాజుల శ్రీదేవి, కోడి రమేష్, గాజుల ముఖేష్ గౌడ్, బియ్యాల సతీష్ రావు, మున్నరాజ సిసోడియా, బత్తుల సమ్మయ్య, సత్రం రమేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.
