మంచిర్యాల జిల్లా.
మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ మహాత్మ జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో 2025 – 26 విద్యా సంవత్సరానికి సంబంధించిన మిగిలిన సీట్ల భర్తీ కోసం 6, 7, 8, 9 తరగతులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు అధికారులు తెలిపారు. 6 తరగతి ప్రవేశానికి ఆగస్టు 2025 నాటికి 12 ఏళ్లకు మించి దాటి ఉండకూడదు మరియు ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు రెండు సంవత్సరాల సడలింపు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈనెల 31 లోపు దరఖాస్తు పూర్తి చేసుకోవాలని అర్హులైన విద్యార్థులు అధికారులు సూచించారు.





