మంచిర్యాల జిల్లా.
మంచిర్యాలలో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి – బిజెపి నాయకులు రఘునాథ్.
విజయ రామారావుపై జరిగిన దాడిని ఖండిస్తూ డీసీపీకి వినతి పత్రం ఇచ్చిన బిజెపి నాయకులు రఘునాథ్.
మంచిర్యాలలో బిజెపి నాయకుడు విజయ రామారావుపై జరిగిన దాడిపై మంచిర్యాల డిసిపి కార్యాలయంలో డీసీపీ భాస్కర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం బిజెపి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థ మంచిర్యాలలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అదేవిధంగా కాంగ్రెస్ చేసే దాడులు అరికట్టా వలసిన బాధ్యత పోలీసులపై ఉందని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి మరియు అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.





