ప్రాంతీయం

మంచిర్యాలలో వందే భారత్ రైలు నిలుపుదల చేయాలని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రికి వినతి పత్రం అందించిన బీజేపీ

26 Views

మంచిర్యాల జిల్లా.

మంచిర్యాలలో వందే భారత్ రైలు నిలుపుదల చేయాలని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వి.సోమన్నకి వినతి పత్రం అందించిన బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి.

సికింద్రాబాద్- నాగ్ పూర్ మధ్య నడుస్తున్న వందే భారత్ రైలుకు మంచిర్యాల రైల్వే స్టేషన్ లో హాల్టింగ్ ఇవ్వాలని కోరుతూ ఈరోజు హైదరాబాద్ చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవానికి వచ్చిన కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వి.సోమన్న గారిని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ మరియు బీజేపీ నాయకులు కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ నివేదిక మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే లో ఆదాయ పరంగా మంచిర్యాల రైల్వే స్టేషన్ నాన్ సుబర్బన్ గ్రేడ్ రైల్వే స్టేషన్ (NSG 4) జాబితా లో 30 వ స్థానంలో ఉందని అత్యధిక ఆదాయం ఉన్న మంచిర్యాల రైల్వే స్టేషన్ లో వందే భారత రైలు నిలుపుదల చేయడం లేదని కిషన్ రెడ్డి గారికి తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక్క రైల్వే స్టేషన్ లో కూడా వందే భారత్ హాల్టింగ్ లేదని వారి దృష్టికి తీసుకెళ్లారు. రామగుండం మరియు మంచిర్యాల రైల్వేస్టేషన్ మధ్య దూరం తక్కువ ఉందని మంచిర్యాల రైల్వే స్టేషన్ లో వందే భారత రైలు నిలుపడం లేదని మరి అదే చంద్రపూర్ మరియు బల్లార్ష మధ్య తక్కువ దూరం ఉన్న రెండు స్టేషన్లలో రైలు హాల్టింగ్ సదుపాయం ఉందని వారికి తెలియజేయడం జరిగింది. మంచిర్యాల రైల్వే స్టేషన్ నుండి నిత్యం అనేక మంది వ్యాపారులు, విద్యార్థులు మరియు ఉద్యోగులు హైదరాబాద్ మరియు నాగ్ పూర్ వెళ్తుంటారని మంచిర్యాల రైల్వే స్టేషన్ లో రైలు నిలిపితే రైల్వే సంస్థకు అధిక ఆదాయం రావడంతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది కావున ఈ విషయం సంబధిత రైల్వే అధికారులు దృష్టికి తీసుకువెళ్లి మంచిర్యాల రైల్వే స్టేషన్ లో వందే భారత్ రైలు హాల్టింగ్ కల్పించే విధంగా కృషి చేయాలని వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది.

ఈ విషయం పై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందిస్తూ త్వరలో మంచిర్యాల లో వందే భారత్ రైలు నిలుపుదలకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల పట్టణ అధ్యక్షులు వంగపల్లి వెంకటేశ్వర్ రావు, మంచిర్యాల మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్, బెల్లంకొండ మురళీధర్, జయ రామ రావు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్