సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజక వర్గం నుండి మాల మహానాడు శ్రేణులు హైదరాబాద్ పెరెడ్ గ్రౌండ్ లో జరిగే మాల సింహ గర్జనకు గజ్వేల్ నుండి భారీగా తరలి వెళ్లారు, గజ్వేల్ నడి బొడ్డున ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమల వేసి బయలు దేరడం జరిగింది ఈ కార్యక్రమనికి నేతృత్వం వహిస్తున్న మాల మహానాడు జాతీయ నాయకులు తుమ్మ శ్రీనివాస్ మాట్లాడుతూ మాలలు తెలంగాణ రాష్ట్రము లో అత్యధికంగా ఉన్నారు, మాల ల చరిత్ర ఎవరు చేరిపివేయలేరు అని మాల ల మీద చేస్తున్న విషప్రచారం మానుకోవాలి అని ఎన్నో ఉద్యమాలకు మాలలు నేతృత్వం వహించారు సమాజ హితం కోరే వ్యక్తులు వారు అని అన్నారు తెలంగాణ ఉద్యమం సమయములో కూడా మాల లు ముందు ఉండి ఉద్యమం చేశారు అని గుర్తు చేశారు ,దేశాన్ని పెత్తందార్లు పరిపాలించాలని, ఆనాటి నుండి విభజించు పాలించు అనే సూత్రాన్ని అమలు చేస్తున్నారు నేడు అదే జరిగింది అని వర్గీకరణ పేరుతో అగ్రవర్ణాలు రాజకీయ పబ్బము గడుపుతున్నారు, నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్లకు మాత్రమే ఈ రాజకీయ పార్టీలు అమలు చేస్తున్నవి తప్ప ఎ ఒక్క అగ్ర పార్టి నాయకులు రిజర్వేషన్లు పెంచే ప్రయత్నం చేయలేదు వారికి మాల మాదిగలు కలిసి ఉంటే వారి రాజకీయ భవిష్యత్తు శూన్యము అని తెలిసి వర్గీకరణ ద్వారా మాల మాదిగలను వీడియో కొడుతున్నారు, మాలలకు జరుగుతున్న ఆర్థిక , సామాజికంగా , రాజకీయ అన్యాయాలకు ఎదిరించడానికి ఈ మాలల బహిరంగ సభ అని అన్నారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర నాయకులు చిప్పల యాదగిరి, బండారు దేవేందర్, నాయకులు మన్నె కృపానందం, గంట సత్యనారాయణ, కుక్కల శ్రీనివాస్, ఎడ్ల భూమయ్య , మంగోల్ అనిల్, నిరుడు ప్రవీణ్, సత్యనారాయణ, మన్నే అరుణ్ కుమార్, శేఖర్ ,మలేష , చిప్పల యాదగిరి, తుమ్మ యాదగిరి, స్వామి తదితరులు పాల్గొన్నారు
