ఆధ్యాత్మికం

సామాజిక సేవలో అంజనీపుత్ర ముందడుగు – మంచిర్యాల ఎస్సై

160 Views

మంచిర్యాల జిల్లా , చున్నంబట్టి వాడ 100 ఫీట్ల రోడ్డులో.

సామాజిక సేవలో అంజనీపుత్ర ముందడుగు
-మంచిర్యాల ఎస్సై సురేష్.

మంచిర్యాల… సామాజిక సేవలో అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ సంస్థ మరింత ముందడుగు వేయాలని వారి సేవలు ఆదర్శమని మంచిర్యాల ఎస్సై సురేష్, హిందూ ఉత్సవ సమితి జిల్లా అధ్యక్షుడు దీపేశ్ రేన్వ అన్నారు. సోమవారం అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ సంస్థ ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద ఏర్పాటుచేసిన . వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా సంస్థ ప్రతినిదులు వారికి ఘన స్వాగతం పలికి సత్కరించారు.

అనంతరం ఎస్సై సురేష్, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు దీపేష్ రేన్వ అంజనీపుత్ర సంస్థ చైర్మన్ గుర్రాల శ్రీధర్ మాట్లాడుతూ అంజనీపుత్ర యువత ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాలుపంచుకోవడం సంతోషంగా ఉందన్నారు.సంస్థ చైర్మన్ గుర్రాల శ్రీధర్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక భావంతో మానసిక శక్తి సిద్ధించడంతోపాటు సేవా దృక్పథం అలవడుతుందన్నారు, ఎండీ పిల్లి రవి మాట్లాడుతూ ప్రజల లో స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుందన్నారు. వినాయక చవితి నవరాత్రులు ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో జరుపుకుంటూ లోక క్షేమం కోసం పూజలు, అన్నదానాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఆ గణనాథుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలు ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో అంజనీపుత్ర సంస్థ చైర్మన్ గుర్రాల శ్రీధర్, ఎండీ పిల్లి రవి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లు ఎస్ .కిషన్, సదానందం, డైరెక్టర్ లు తదితరులు పాల్గోన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్