(తిమ్మాపూర్ సెప్టెంబర్ 03)
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ విద్యుత్తు ఉద్యోగుల సంఘం జేఏసీ పిలుపుమేరకు మంగళవారం తిమ్మాపూర్ మండల కేంద్రంలోని అలుగునూర్ లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా కరీంనగర్ రూరల్ డివిజన్ సెక్రటరీ ఇల్లందుల రత్నం మాట్లాడుతూ వివాదాస్పదమైన ఆర్డర్లను రద్దు చేస్తూ, కాన్ సీక్వెన్షియల్ సీనియారిటీని కొనసాగించాలన్నారు. అర్టిజెన్ల డిమాండ్స్ కన్వర్షన్స్, ఏపీ ఎస్ ఈ బి సర్వీస్ రూల్స్ వర్తింపజేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సింహచలం, లైన్ ఇన్స్పెక్టర్ చంద్రయ్య, లైన్ మెన్,ఏఎల్ఎం లు,శివోన్, శ్రీనివాసు, జేఎల్ఎం, రాజు పాల్గొన్నారు.





