గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని నెల్లటూరు గ్రామంలో వెలసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలా త్రిపుర సుందరి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ముందుగా అభిషేకాలు అర్చనలు నిర్వహించి భక్తుల గోత్రనామాలతో అర్చకులు పద్మనాభ శర్మ పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తులు విశేష సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు.
