ప్రాంతీయం

చూసి ఓర్వలేక

80 Views

కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న నోటిఫికేషన్లను చూసి ఓర్వలేక

రంగారెడ్డి జూలై 22 

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎలాగైనా పడగొట్టాలని ధ్యాసే తప్ప గత పది సంవత్సరాలుగా చేసిన తప్పులను గ్రహించి సరియైన ప్రతిపక్ష పార్టీగా ఎదగాలన్న సోయి లేని భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తున్న నోటిఫికేషన్లు చూసి ఓర్వలేక “దొంగే” దొంగ దొంగ.. అని అర్చినట్లు వ్యవహరిస్తుందని బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ ఆరోపించారు.

సోమవారం నాడు ఆయన మా ప్రతినిధితో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎల్లవేళలా నిరుద్యోగుల పక్షాన ఉంటూ వారి కోరికలు నెరవేర్చడానికి ఏర్పడింది. కాని కేసీఆర్ మాత్రం ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వాన్ని 7 నెలలకే గాయపరచాలని ఇంకో ఆరు నెలల లోపు భూస్థాపితం చేయాలని విచిత్రమైన కలలు కంటున్నాడని ఆరోపించారు.ప్రాథమిక పాఠశాల నుండి యూనివర్సిటీల వరకు విద్యావ్యవస్థలు అత్యంత నిర్లక్ష్యానికి గురి చేసిన చరిత్ర టిఆర్ఎస్ పాలకులదని తెలంగాణలో చాలా పాఠశాలలు పాతబడి కూలడానికి సిద్ధంగా ఉన్న వాటి వైపు కన్నెత్తి చూడలేదని ప్రభుత్వ పాఠశాలలకు గురుకుల పాఠశాలలకు జూనియర్ కళాశాలలకు మౌలిక వసతులు సొంత భవనాలు లేక అద్దె భవనాలలో విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్న పట్టించుకోలేదని మధ్యాహ్నం భోజనానికి సరి అయిన నిధులు కేటాయించమని ఎన్నిసార్లు విద్యార్థి సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు మొత్తుకున్న కనికరించలేదని విద్యార్థులు లేరన్న సాకుతో ఎన్నో ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల మూసివేశారని యూనివర్సిటీల పరిస్థితి చెప్పనవసరం లేదని సరైన మౌలిక వసతులు లేక బోధన బోధనేతర సిబ్బంది లేక వాటిని మూసివేసే పరిస్థితికి దిగజారారని పార్టీ అధికారంతోనే ప్రైవేటు యూనివర్సిటీలను పెట్టించి ప్రైవేటు విద్యారంగాన్ని ప్రోత్సహించారని ఆరోపించారు. నాడు నిరుద్యోగుల విషయంలో జరిగిన పొరపాటు వల్లనే అధికారాన్ని కోలిపోయామని గ్రహించిన బి ఆర్ఎస్ పార్టీ పెద్దలు నేడు అదే నిరుద్యోగులను మరొకసారి అస్త్రంగా చేసుకొని  జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు. నిరుద్యోగులకు అన్యాయం జరిగినప్పుడు ఎవరైనా ఎప్పుడైనా పోరాటం చేయాల్సిందే తప్పులేదు కానీ గత పది సంవత్సరాలుగా ఏ నోటిఫికేషన్ కూడా సరి అయిన పద్ధతిలో వేసి పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు ఇచ్చిన సందర్భం లేదు. తెలంగాణ వస్తే ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం వస్తుందని చెప్పి వారిని ఉద్యమంలోకి లాగి ప్రాణాలు బలి తీసుకున్న కేసీఆర్ తెలంగాణ వచ్చిన తరువాత కూడా నిరుద్యోగుల బలిదానాలు ఆగకపోవడానికి కారణాలు ఏమిటో తెలుసుకోలేకపోయారని అన్నారు. పైగా ఉద్యోగాలు వెయ్యమని ధర్నాలు ఉద్యమాలు చేసిన వారిపై అక్రమ కేసులు పెట్టి చిత్రహింసలకు గురి చేశారని ఉస్మానియా యూనివర్సిటీ తో పాటు మిగతా అన్ని యూనివర్సిటీలలో నిరుద్యోగులు విద్యార్థి సంఘాలు ఉద్యమాలు చేయకుండా కట్టడి చేసేందుకు యూనివర్సిటీ వీసీలను తోలుబొమ్మలాగా ఆడించారని ప్రతిరోజు యూనివర్సిటీలో పోలీసు పికెటింగ్ నిర్వహించారని ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఇన్ ఫార్మర్ పోలీసులతో ఉద్యమకారులపై నిఘా పెట్టి అరెస్టు చేశారని ఆర్ట్స్ కాలేజీ ముందు ధర్నాలు చేయొద్దు మీటింగులు పెట్టొద్దు దిష్టిబొమ్మలు దగ్ధం చేయొద్దు అంటూ కనీసం నిరసన తెలిపే హక్కు లేదన్నట్లు నిర్బంధించారని నిరుద్యోగులను విద్యార్థి సంఘాలను హాస్టల్లో నిర్బంధించి గది గదికి తిరిగి అరెస్టు చేయించేలా వైస్ చాన్సలర్లకి నోటీసులు ఇప్పించారని ఏం అప్పుడు విద్యార్థులు చేసిన ఉద్యమాలు మీ కంటికి కనిపించలేదా? అని ప్రశ్నించారు. అధికారంలో ఉంటే ఒకలా లేకపోతే ఇంకోలా ప్రవర్తిస్తారా? నోటిఫికేషన్లు ఇచ్చిన కొన్ని రోజుల వ్యవధిలోని గురుకుల పరీక్షలు పెట్టింది టిఆర్ఎస్ ప్రభుత్వమే కదా అప్పుడు గుర్తు రాలేదా, పరీక్షకు పరీక్షకు మధ్య వ్యవధి ఉండాలని అప్పుడు పోస్టులు పెంచాలని అడిగిన నిరుద్యోగులను హేళన చేసింది మీరే కాదా.అని ప్రశ్నించారు. జీవో 46 మీకు సోయి లేకుండా ఇచ్చారా ఎన్నోసార్లు ఈ జీవోను ఎత్తివేయండి అని నిరుద్యోగులు మిమ్మల్ని కలవాలని ప్రయత్నించిన ఒక్కసారి కలవలేదు. నిరుద్యోగులతో ఏమైతుంది లే అనుకొని వారి ఉద్యమాలను అణిచివేశారు. గత పది సంవత్సరాల నుంచి గ్రూప్-1 పరీక్ష నిర్వహించకుండా పేపర్ లీక్ చేస్తూ పోస్టులు అమ్ముకొని నిరుద్యోగ భృతి ఇస్తామని ఇవ్వకుండా అన్యాయం చేశారు. 2016- 17 లో నిర్వహించిన డీఎస్సీ గ్రూప్ రెండు పరీక్షల తర్వాత దాదాపు 8 సంవత్సరాలుగా మళ్లీ నోటిఫికేషన్లు లేవు. ఇప్పుడు ఈ అన్ని పరీక్షలో నిర్వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి ఓర్వలేక నిరుద్యోగులను రెచ్చగొట్టే ప్రధాన ఎజెండాతో పని చేస్తున్న భారత రాష్ట్ర సమితి మీరు ఇచ్చిన నోటిఫికేషన్ ఇప్పటి నోటిఫికేషన్లకు తేడా మీరే చూసుకోండి, అయినా మీరు చెప్పకపోయినా నిరుద్యోగుల కోరికలను పరిగణలోకి తీసుకొని పరీక్షకు, పరీక్షకు, మధ్య వ్యవధి ఉండేలా కాంగ్రెస్ ప్రభుత్వం జాగ్రత్త పడుతూనే ఉందని శ్రీకాంత్ అన్నారు.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్