ప్రాంతీయం

మొద్దునిద్రలో అధికారులు.. నేటికీ కరీంనగర్ బోర్డుతో ప్రాథమిక ఆరోగ్యకేంద్రం…

57 Views

 ముస్తాబాద్, జూలై 19 (24/7న్యూస్ ప్రతినిధి): ఇందిరమ్మ కాలనీలో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం సబ్ సెంటర్ పరీక్ష లోపంతో నిరాదరణకు గురవుతోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర బోర్డుపై ఉమ్మడి ఆంధ్ర ఉన్నప్పుడు రాసిన కరీంనగర్ పేరు నేటికీ మార్చలేదు. రాష్ట్రాలువేరై జిల్లా పేర్లు మారిన కరీంనగర్ పేరు మీదనే ఉంది. నాడు తెలంగాణ ప్రభుత్వం పేర్లు మార్చాలని ఉత్తర్వులు జారీ చేసిన అధికారులు కరీంనగర్ జిల్లా పేరుస్థానంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఉండవలసినది. కానీ మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నిద్రపోతున్న అధికారులు. ఇదిలా ఉండగా ఓవైపు పర్యావేక్షణ లోపంతో కిటికీల అద్దాలు పగిలిపోయి ఆరోగ్య కేంద్రం పరిసరాలలో పిచ్చిమొక్కలతో ప్లాస్టిక్ కవర్లు చెత్తకాగితాలతో అల్ముకుంది. కనీసం గేటుకు తాళం వేయడానికి భవన పరిసరాలు కుక్కలకు నివాసంగా మారింది. దరఖాస్తు ముస్తాబాద్ మండలంలో పారిశుద్ధ్యం పడకపోవటంతో పాటు అనేక అక్రమంగా విధుల్లో దుర్వినియోగం చేస్తూ దుర్వినియోగం చేస్తున్నార ని తెలిపారు. ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టిస్తున్న అధికార యంత్రాంగాన్ని పైఅధికారులు కాపాడుకుంటూ ఉన్నంతశ్రద్ధ ఆరోగ్య కేంద్రంమీద ఎక్కడిదంటున్నారు. ప్రభుత్వాలు మారిన అధికారులు ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడి విధులపట్ల శ్రద్ధచూపాలని ప్రజలు కోరుతున్నారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్