ఖమ్మం పల్లి డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల కు అండగా
వంటేరు ప్రతాప్ రెడ్డి
కొండపాక మండలం:
నిన్న కొండపాక మండలంలోని ఖమ్మం పల్లి గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మూర్ఖత్వపు ఆలోచనలతో అధికార బలంతో రెవెన్యూ సిబ్బందిని పోలీస్ సిబ్బందిని అడ్డుపెట్టుకొనీ అక్రమంగా అన్యాయంగా నిరుపేద 19 కుటుంబాల సభ్యులను రోడ్డున పడవేసి ఇండ్లలో ఉన్న సామాన్లను సైతం పేదవారిని చూడకుండా బయటపడవేసి ఇండ్లకు తాళాలు వేసి సీజ్ చేసిన ఘటన ఖమ్మం పల్లి గ్రామంలో జరిగింది. విషయం తెలుసుకున్న గజ్వేల్ నియోజకవర్గం బి ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఈరోజు ఖమ్మం పల్లి గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఇండ్లను పరిశీలించారు, అనంతరం లబ్ధిదారులతో మాట్లాడుతూ వారి బాధలను విన్నారు. లబ్ధిదారులకు ధైర్యాన్ని చెప్పడం జరిగింది.
ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ
గతంలోని కెసిఆర్ ప్రభుత్వం ఖమ్మం పల్లి గ్రామంలో 60 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలు చేపట్టి దాదాపు 41 ఇండ్లను నిరుపేద వారికి కేటాయించడం జరిగిందన్నారు, ఎన్నికలు సమీపించిన క్రమంలో ఎన్నికల కోడ్ రావడంతో మిగిలిన 19 ఇండ్లను కూడా లబ్ధిదారులను ఆ ఇండ్లకు పంపించడం జరిగిందన్నారు, 19 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో ఉన్న ప్రజలు పేద ఉన్న ప్రజలు నిరుపేదలు అన్నారు వారికి ఎలాంటి ఆస్తుపాస్తులు కూడా లేవన్నారు అందులో కామే పరిస్థితి దయనీయంగా ఉందన్నారు, నిన్న అధికారులు చేసిన పరాకాష్ట చర్యలకు కొండాపురం పద్మ అనే మహిళ సొమ్మసిల్లిఅక్కడే పడిపోయింది అన్నారు, ఇప్పటికైనా కలెక్టర్ , ఆర్డీవో, మానవతా దృక్పథంతో ఆలోచించి, వారికి ఇండ్లకు వేసి ఇలా తాళాలను తీసి లబ్ధిదారులకు ఇండ్లను కేటాయించి పట్టాలను అందించాలన్నారు, లబ్ధిదారులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసాని ఇచ్చారు, లబ్ధిదారులకు పట్టాలు లభించే వరకు వారి తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మండల రైతు కోఆర్డినేటర్ రాగల దుర్గయ్య, మండల పార్టీ అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్, ఖమ్మం పల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు జిర్ర రాజు,అహ్మద్, దున్న సాయిలు, కోడెల మల్లేశం,మార్పడగా కనకయ్య,దోమల శ్రీశైలం, అందె యాదగిరి లబ్ధి దారుల కుటుంబ సభ్యులు తదితరులున్నారు.
