మంచిర్యాల జిల్లా :
మందమర్రి ఎంపిడిఓ కార్యాలయంలో మందమర్రి మండలంలోని 58 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదిముభారక్ చెక్కులను అందజేసిన చెన్నూరు ఎమ్మేల్యే వివేక్ వెంకటస్వామి.
ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్ పర్సన్ నల్లాల ఓదెలు,మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు,ప్రజా ప్రతినిధులు,అధికారులు.
వివేక్ వెంకటస్వామి సార్ కామెంట్స్…
గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో వివిధ శాఖల నిధులను ఇష్టానుసారంగా ఖర్చు చేయడంతో తేలంగాణ రాష్ట్రం లోని ఖజానా ఖాళీ అయింది.
రాష్ట్రంలో ప్రజలకు ప్రజా పాలన అందిస్తూ నిధులను సమకూర్చే దిశగా సిఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారు.
సింగరేణి సంస్థ లో కొత్త గనులను తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సిఎం రేవంత్ రెడ్డి ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
సింగరేణిలో కొత్త.గనుల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలి.
