రాజకీయం

నీట్ పరీక్ష పేపర్ లీకేజి పై భగ్గుమన్న విద్యార్థి సంఘాలు.!

58 Views

సిద్దిపేటలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 18)

నీట్ పరీక్ష పేపర్ లీకేజి పై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి.మంగళవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో పీ.డీ.ఎస్.యు,ఎన్.ఎస్.యు ఐ,ఎస్ఎఫ్ఐ,యూత్ కాంగ్రెస్ సంఘాల ఆద్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.ఈ సందర్భంగా పీ.డీ.ఎస్.యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వి.శ్రీకాంత్ మాట్లాడుతూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహకం వల్ల దేశ వ్యాప్తంగా ఇరవై నాలుగు లక్షల విద్యార్థులు నీట్ పరీక్ష పేపర్ లీకేజి వల్ల నష్ట పోయారని ఆరోపించారు.ఇంత జరిగినా దేశ ప్రధాని మోడీ నోరు మెదపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎన్టిఏ ను రద్దు చేసి నీట్ పరీక్షను మళ్ళీ నిర్వహించాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా ఎన్.ఎస్.యు.ఐ,యూత్ కాంగ్రెస్, ఎస్ఎఫ్ఐ నేతలు అజ్మత్, సంజీవ్, వహాబ్ మాట్లాడుతూ తక్షణమే నీట్ పరీక్ష ఫలితాలను రద్దుచేసి నీటి పరీక్ష నిర్వహణను రాష్ట్రాలకు అప్పగించాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకేజ్ విషయంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని బాధ్యులను చట్టప్రకారం శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బిజెపి ఎంపీల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్.యు.ఐ జిల్లా కార్యదర్శి భాను,ఉపాధ్యక్షుడు అజ్మత్ అలి,ఎస్.ఎఫ్.ఐ,పీడీఎస్.యు నాయకులు ర్యాషద్,రవి, నిశాంత్ గౌడ్,ప్రతాప్ ,వంశి,సాయి రాజా,క్రాంతి,రాజా బాబు,లక్ష్మణ్, జవిద్ ,అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్