పట్టపగలే వెలుగుతున్న వీధిలైట్ల
సిద్దిపేట జిల్లా మే 31
సిద్దిపేట జిల్లా శివార్ వెంకటాపూర్ గ్రామంలో గ్రామ పంచాయితీ ఆధ్వర్యంలో ఉన్న విధి లైట్లు పట్టపగలే వెలుగుతుండడంతో చూసిన ప్రజలు ఆశ్చర్యపోయి తమ కెమెరాలతో ఫోటోను క్లిక్ మనిపించారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ వినియోగం విషయంలో విద్యుత్ ఆదా చేయాలని ఎన్నో కార్యక్రమాల ద్వారా వివరిస్తూ ప్రజలను చైతన్యపరిచే విధంగా కార్యక్రమాలు చేపట్టిన గ్రామపంచాయతీ అధికారుల పనితీరుపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా గ్రామపంచాయతీ సిబ్బంది స్పందించి వీధిలైట్లు సకాలంలో వెలిగే విధంగా చూడాలని శివార్ వెంకటాపూర్ గ్రామ ప్రజలు గ్రామపంచాయతీ మరియు సంబంధిత అధికారులను కోరుతున్నారు.





