Breaking News

డీజిల్ ట్యాంకర్ బోల్తా ఒకరు మృతి….

259 Views

(శంకరపట్నం మే 15)

శంకరపట్నం మండలంలోని తాడికల్ గ్రామంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

హుజురాబాద్ వైపు నుండి కరీంనగర్ వెళ్తున్న డీజిల్ ట్యాంకర్ డ్రైవరు అతివేగంగా అజాగ్రత్తగా వాహనాన్ని నడుపుతూ వంకాయ గూడెం వద్ద ఒక వ్యక్తిని ఢీ కొని , అదే కంగారు లో అధిక వేగంతో లారీని నడుపుతూ తాడికల్ గ్రామంలో ఆటోను ఢీకొని బోల్తా పడడంతో ఒకరు మృతి చెందారు.

మృతుడు తాడికల్ గ్రామవాసి పూదరి శ్రీనివాస్ (45)గా పోలీస్ లు గుర్తించారు..

మరో ఏడుగురి కి తీవ్ర గాయాలు అయ్యాయి..

వెంటనే స్థానికులు 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు..

ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

No Slide Found In Slider.

Poll not found