(తిమ్మాపూర్ మే 10)
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణిగుంట టోల్ ప్లాజా వద్ద నిర్మించిన ఇంటిగ్రేడ్ చెక్ పోస్ట్ వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ వాహనాన్ని నిలిపివేశారు. అనంతరం పోలీసులు, ఎన్నికల సిబ్బంది మంత్రి పొన్నం ప్రభాకర్ వాహనాన్ని తనిఖీ చేయగా వారికి పూర్తిగా మంత్రి పొన్నం ప్రభాకర్ సహకరించారు. తనిఖీల అనంతరం మంత్రి తన వాహనంలో కరీంనగర్ కి బయలుదేరి వెళ్లారు..





