బీఆర్ఎస్ పార్టీలో చేరిక
మంచిర్యాల నియోజకవర్గం దండేపల్లి మండలంలోని ద్వారక గ్రామానికి చెందిన 70 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, నాయకురాలు, పార్టీని వీడి *మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్, మాజీ మంత్రి పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ సమక్షంలో* బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది…
అనంతరం వారు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా ప్రజలను మోసగించిన కాంగ్రెస్ పార్టీ పరిపాలన తీరు నచ్చక, మరియు తెలంగాణకు కేసిఆర్ పరిపాలనే శ్రీరామరక్ష అని కాంగ్రెస్ పార్టీ వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు అలాగే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గారి గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపారు…




