ఆధ్యాత్మికం

సీతరాముల కళ్యాణం ప్రత్యక్ష ప్రసారం – భద్రాచలం

94 Views

నేడు సీతారాముల కళ్యాణ మహోత్సవం

భద్రాచలం శ్రీసీతారాముల కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది.

ఏప్రిల్ 4న రాముడి కల్యా ణాన్ని ప్రసారం చేయడంపై ఈసీ నిషేధం విధించింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యం లో ఈసీ ఈ ఆంక్షలు విధించింది.

అయితే ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. నాలుగు దశాబ్దాలుగా రాముల‌వారి కల్యాణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని లేఖలో పేర్కొన్నారు.

ఈసీ నిర్ణయంపై రాజకీయ పార్టీలు కూడా అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఎన్నికలకు దేవుడికి సంబంధం లేదని పేర్కొన్నాయి. దీనిపై స్పం దించిన ఎన్నికల సంఘం ఈరోజు జరగబోయే సీతారాముని కళ్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఈసి అనుమతి ఇచ్చింది.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్