వ్యవసాయం

వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం..

165 Views

(తిమ్మాపూర్ ఏప్రిల్ 03)

కరీంనగర్ జిల్లా పాలనధికారి ప్రమేల సత్పతి ఆదేశాలనుసారం బుధవారం తిమ్మాపూర్ మండల కేంద్రంలోని గొల్లపల్లి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించినట్లు నుస్తూలపూర్ సొసైటీ సిబ్బంది తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..

రైతులు తాము పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మి నష్టపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని అమ్మి ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధరన పొందాలన్నారు. ఏ గ్రేడ్ కి రూ.2203 బి గ్రేడ్ కి రూ.2183 మద్దతు ధర నిర్దేశించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కొనుగోలు కేంద్రం ఇంచార్జి గడ్డం మహేందర్ రైతులు పింగిలి కృష్ణ రెడ్డి,మామిడి విద్యాసాగర్,వేల్పుల మధు,సాయిల్ల మల్లవ్వ ,వెన్నం సుధాకర్ రెడ్డి,మల్లెతుల తిరుపతి,తాళ్లపల్లి సంతోష్, కొమ్మెర శ్రీనివాస్ రెడ్డి, రేషవేణి మల్లయ్య, మల్లెతుల రాజయ్య, హమాలీలు తదితరులు పాల్గొన్నారు..

No Slide Found In Slider.

Poll not found
Manne Ganesh Dubbaka constancy 9701820298