భద్రాచలం ఏప్రిల్ 2
భద్రాచలం రామాలయంలో 17న శ్రీరామనవమి మహోత్సవం నిర్వహించనున్న నేపథ్యంలో 17 సాయంత్రం 6 గంటలకు శ్రీరామ పునర్వసు దీక్షలు ప్రారంభిస్తున్నట్లు ఈవో రమాదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మే 13న ఈ దీక్షల విరమణ ఉంటుందని పేర్కొన్నారు. ఆ రోజున పాదుకా పూజ, తిరువడి ధారణ, సంక్షేప రామాయణ హవనం, గిరి ప్రదక్షణ, రథోత్సవం ఉంటుందని తెలిపారు.
