ప్రాంతీయం

టెట్ పరీక్ష ఫీజు తగ్గించాలి.. కంచర్ల రవి గౌడ్…

101 Views
 ముస్తాబాద్, మార్చి 26 (24/7న్యూస్ ప్రతినిధి): తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)2024  కి సంబదించిన ఫీజులను పెంచడం పేద నిరుద్యోగ అభ్యర్థులకు అన్యాయం చేయడమేనని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవిగౌడ్ అన్నారు. వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన టెట్ నోటిఫికేషన్ ఈనెల 27నుండి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానున్న సందర్భంలో ఈ సారి అప్లికేషన్ ఫీజులు భారీగా పెంచడంతో నిరుద్యోగుల పైన  ఫీజుభారం మోపడమే అవుతుందని మండిపడ్డారు. టెట్ పరీక్ష ఫీజు గత ప్రభుత్వంలో 2021లో 200 రూపాయలు 2022లో 300 రూపాయలు గత ఏడాదిలో రెండు పేపర్లు గాను 400 రూపాయలు ఈ సంవత్సరం నోటిఫికేషన్ లో ఒక పేపర్ కి దరఖాస్తు చేసుకుంటే వెయ్యి రెండు పేపర్లు కి దరఖాస్తు చేసుకుంటే రెండు వేల రూపాయలు చెల్లించాల్సి వస్తోందని ఒకే సారి ఫీజు పెంచడం కారణంగా అభ్యర్థులు అనేక రకాలుగా ఆర్థిక సమస్యలతో గురి అవుతారని అన్నారు. ప్రభుత్వం నిరుద్యోగుల పైన అప్లికేషన్ల పేరుతో వసూలు చేస్తున్నారు. ఇలాంటి వైఖరి సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోటీ పరీక్షలకు ఎలాంటి అప్లికేషన్ ఫీజులు వసూలు చేయమని ఎన్నికలలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ అప్లికేషన్ల ఫీజు పేరుతో భారీగా వసూలు చేయడం సిగ్గుచేటని నిరుద్యోగ యువతకు అన్యాయం చేయడమే అని అన్నారు. ప్రజా  ప్రభుత్వం అంటే ఇదేనా అని ఫీజుల పేరుతో నిరుద్యోగుల పైన బారం మోపడమెన ?ఫీజులు 150 శాతం నుండి300 శాతం టెట్ పరీక్ష ఫీజుల పెంపు పై ప్రభుత్వం పునరాలోచన చేయాలని పెంచిన ఫీజులు తగ్గించాలి అని డిమాండ్ చేస్తున్నామని పేర్నోన్నారు.లేని పక్షంలో ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని నిరుద్యోగుల ఆగ్రహానికి గురి కాక తప్పదు అని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టే శ్రీనివాస్ నాయకులు నవీన్. పోతర్ల వంశీ. గౌరు రాకేష్ . సూర రంజిత్.కందుకూరి విజయ్. కొడం వెంకటేష్. నరేష్. అషూ. ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్