Breaking News

పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రజావాణి కార్యక్రమం తాత్కాలికంగా రద్దు

112 Views

-పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రజావాణి కార్యక్రమం తాత్కాలికంగా రద్దు :: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల , మార్చి -17:

పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినందున, ఎన్నికల విధుల్లో జిల్లా అధికారులు, సిబ్బంది నిమగ్నమై ఉన్నందున ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఎన్నికలు నిర్వహణలో భాగంగా ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికముగా రద్దు చేయడం జరిగిందని, ఇట్టి విషయాన్ని ప్రజలు గమనించాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found