అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 18 క్వింటాళ్ళ పిడిఎస్ రైస్ పట్టుకున్న టాస్క్ ఫోర్సు పోలీసులు.
రామగుండము పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాసులు .ఐపీఎస్., (ఐజీ) ఆదేశాల మేరకు ఈరోజు పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధి చుట్టప్రక్కల ప్రాంతాల నుండి తక్కువ ధరలకు కొనుగోలు చేసి పెద్దపల్లి పట్టణం తెనుగు వాడ లోని ఒక ఇంట్లో పిడియస్ బియ్యన్ని నిల్వ ఉంచారనే నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్సు సిబ్బంది మహేందర్, చంద్రశేఖర్, సునీల్ లు కలిసి తనిఖీ నిర్వహించగా 37 బ్యాగ్ లలో నింపి ఉన్న అట్టి పిడియస్ రైస్ నూనె వెంకటేష్, తెనుగు వాడ, పెద్దపల్లి కి చెందినవి గా గుర్తించి సుమారు 18 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ స్వాధీన పరుచుకోవడం జరిగింది.
తదుపరి విచారణ నిమిత్తం పెద్దపల్లి పోలీస్ స్టేషన్ వారికీ అప్పగించడం జరిగింది.
