రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో యువకుడు నిద్రిస్తూనే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం పోతుగల్ గ్రామానికి చెందిన చందు(20) అనే యువకుడు కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. బుధవారం కుటుంబ సభ్యులతో పాటు భోజనం చేసి నిద్రపోయాడు. ఉదయం లేచి తల్లిదండ్రులు చందును గమనించగా నిద్రలోనే మృతి చెందినట్లు తెలిపారు.




