ప్రజాస్వామ్య విజయానికి వజ్రాయుధం ఓటు హక్కు
రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన బ్రహ్మాస్త్రం ఓటు హక్కు
సిద్దిపేట్ జిల్లా జనవరి 25
సిద్దిపేట జిల్లా ఓటు నోటుకు, మద్యానికి, మాంసానికి అమ్ముకోవద్దు కత్తుల భాస్కర్ రెడ్డి
నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కత్తుల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఓటును నోటుకు, మద్యానికి, మాంసానికి అమ్ముకోవద్దని రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన బ్రహ్మాస్త్రం ఓటు హక్కుని ప్రజాస్వామ్య విజయానికి వజ్రాయుధం ఓటు హక్కు అని కత్తుల భాస్కర్ రెడ్డి అన్నారు
ఓటు అనేది బాణం లాంటిదని ఒక్కసారి వదిలితే మళ్ళీ వెనక్కు రాదని అన్నారు
ఒక్క ఓటు నిర్లక్ష్యమైన ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరమని అన్నారు బుల్లెట్ కన్నా బ్యాలెట్ బలమైందని అన్నారు
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కులమత వర్గ ప్రాంతీయ బేధం లేకుండా ప్రతి ఒక్కరు ఓటు హక్కును నమోదు చేసుకొని ప్రజాస్వామ్య విజయానికి నంది పలకాలని సూచించారు నేడే ఓటరుగా 18 సంవత్సరాలు నిండిన వారు నమోదు చేసుకోండి మీ ఓటు చూపుడువేలుతో తలరాతను మారుస్తుంది ఓటు అనేది అందరి బాధ్యత అందరి హక్కు అని అన్నారు





