(తిమ్మాపూర్ జనవరి 10)
తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామంలో టాక్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన మానకొండూర్ నియోజకవర్గం స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్రికెట్ ఆడి సందడి చేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..
క్రీడాల పట్ల యువత ఆసక్తిని పెంచుకోవాలని సూచించారు.క్రీడలు మానసిక ఉల్లాసనికి, శారీరక ఆరోగ్యానికి దోహదపడతాయని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ టోర్నమెంట్ నిర్వహణకు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న క్రీడాకారులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల నాయకులు, క్రీడాకారులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.