రామగుండం పోలీస్ కమీషనరేట్
తేది :10-01-2024
కోడి పందాల కేసులో 09 మంది బైండోవర్
కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు
భోగి, సంక్రాంతి, కనుమ పండుగల నేపథ్యంలో చెన్నూర్ రూరల్ సర్కిల్ కోటపల్లి, నీల్వాయి పోలీస్ స్టేషన్ ల పరిధిలో కోడి పందాలు ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ విద్యాసాగర్ హెచ్చరించారు. కోడి పందాలు, జూదం వంటి వ్యసనాలు జీవితాన్ని నాశనం చేస్తాయని అన్నారు.
వీటిపై నిఘా ఉంటుందని, చట్ట విరుద్ధ కార్యక్రమాలు చేస్తే సహించేదిలేదని అన్నారు. గతం లో కోడి పందెలలో నిందితులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి ముందస్తు చర్యలలో భాగంగా 09 మందిని బైండొవర్ చేయడం జరిగింది అని తెలిపారు.
సీఐ వెంట కోటపల్లి ఎస్ఐ సురేష్ ఉన్నారు.






