సింగోటం గురుకుల విద్యార్థి హర్షవర్ధన్ సాగర్ గణితం మేదో పరీక్ష లో రాష్ట్ర స్థాయి ఎంపిక
21 డిసెంబర్
కొల్లాపూర్ మండలం జవాయిపల్లి గ్రామానికి చెందిన నీరడి స్వామి కుమారుడు నీరడి హర్షవర్ధన్ సాగర్ సింగోటం మహాత్మా జ్యోతి రావు పూలె గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థి నాగర్ కర్నూల్ జిల్లాకేంద్రం లో నిర్వహించిన గణితం ట్యాలెంట్ టెస్ట్ లో రాష్ట్ర స్థాయి లో ఎంపికయ్యారు.
ఈసందర్బంగా గురుకుల రెసిడెన్సీ
పాఠశాల ప్రిన్సిపాల్ ప్రీతి ఏ టీ పి. ఎస్ రమాకాంత్ డే వార్ధన్ ఈ శ్రీనివాస్ రెడ్డి మరియు పాఠశాల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.
కొల్లాపూర్ కు చెందిన ఉపాధ్యాయులు డి శ్రీకాంత్ హర్షవర్ధన్ సాగర్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా విద్యా విద్యాధికారి గోవింద రాజులు పాల్గొని విద్యార్థి హర్షవర్ధన్ సాగర్ కు ప్రశంస పత్రంపాటు నగదు పురస్కారం అందజేశారు.
విద్యార్థి ప్రతిభకు కొల్లాపూర్ కు చెందిన పలువురు ఉపాధ్యాయులు మరియు ప్రముఖలు హర్షవర్ధన్ సాగర్ కు అభినందనలు తెలియజేశారు.





