(తిమ్మాపూర్ డిసెంబర్ 18)
తిమ్మాపూర్ మండలం మహాత్మా నగర్ గ్రామంలో ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును మనకుండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అధికారుల తో కలిసి సందర్శించారు..
ఈ సందర్బంగా ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ…
ఎమ్మెల్యే గెలిచిన తర్వాత తొలిసారిగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును, అధికారులతో కలిసి సందర్శించడం జరిగింది అన్నారు.
గత పాలకుల పాలనలో ప్రభుత్వ ఆస్తులను ఎత్తుకేళ్లి, ధ్వంసం చేయడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసును బ్రోతల్ హౌస్ గా మార్చరన్నారు…
ఆవు పాలతో శుభ్రం చేసి, సుగంధ దవ్యాలతో హోమం నిర్వహించి, క్యాంప్ ఆఫీస్ ఉన్న చెడ్డ పేరు తొలగించి, క్యాంప్ ఆఫీస్ లోకి ప్రవేశిస్తానన్నారు….
ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ తహశీల్దార్ కనకయ్య, వివిధ మండలల కాంగ్రెస్ పార్టి అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..




