రామగుండం పోలీస్ కమిషనరేట్
తేది 08-12-2023
గంజాయి అక్రమంగా నిల్వా ఉంచిన వ్యక్తిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.
450 గ్రాముల గంజాయి స్వాధీనం
నిందితుని వివరాలు:
MD గౌస్ పాషా , S/o సలీం , 19 yrs, r/o పరుశురాం నగర్, గోదావరిఖని, పెద్దపల్లి జిల్లా.
వివరాలకు వెళ్ళితే
ఈ రోజు గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పరుశురాం నగర్ లోని ఒక ఇంట్లో గంజాయి ఉన్నదనే నమ్మదగిన సమాచారం మేరకు ఇంటీనీ తనిఖీ చేయగా *450 గ్రాములు డ్రై గంజాయి* లభించింది. దీని విలువ సుమారు,10,000/- రూపాయలు ఉంటుంది. అనంతరం అతడిని విచారించగ అతని పేరు *Md గౌస్ పాషా* అని తెలిపి చెడు అలవాట్లకు, గంజాయి కి బానిసై గంజాయి తను తాగడం కోసం మరియు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదగించాలనే దురుదేశ్యంతో మహారాష్ట్ర బళ్లార్ష లో ఒక గుర్తు తెలియని వ్యక్తి వద్ద గంజాయి కొనుగోలు చేసి గోదావరిఖని ప్రాంతంలోని అమాయకపు స్టూడెంట్స్, యువత కి ఎక్కువ ధరకు అమ్ముతానని తెలపడం జరిగింది.
నిందితున్ని అతని వద్ద లభించిన గంజాయి స్వాధీనం చేసుకొని తదుపరి విచారణ కోసం గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో అప్పగించడం జరిగింది.
