శ్రీరాంపూర్ ఎస్ఆర్పి 1 మైన్ వద్ద ఈ రోజు గేట్ మీటింగ్ లో ఎన్నికల ప్రచారం చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగరేణి కార్మికులందరూ, కారు గుర్తుకే ఓటు వేయాలని, తనని మరో సారి దీవించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి , టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి , నాయకులు సురేందర్ రెడ్డి ,మల్ల రెడ్డి, డికొండ అన్నయ్య మరియు సీనియర్ టీబీజీకేఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






