కామారెడ్డి సభకు తరలి వెళ్లిన నాయకులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం కామారెడ్డి పట్టణంలో జరిగే పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సభకు తరలి వెళ్లారు ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి విశేషమైన స్పందన లభిస్తుందన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆరు స్కీముల గ్యారెంటీ కార్డు ద్వారా ప్రజల్లోకి వెళ్లడం జరిగిందన్నారు సిరిసిల్ల నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కేకే మహేందర్ రెడ్డి విజయం ఖాయమన్నారు నాయకులు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పసుల కృష్ణ పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు నాయకులు గుండాటి రాంరెడ్డి బీపేట రాజు నేవూరి రవీందర్ రెడ్డి. ఘంట అంజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు




