రాజకీయం

నేటి నుండి ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభం

128 Views

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్ర‌క్రియ నేటి నుంచి సిద్ధం కానుంది. శుక్రవారం నుంచి ఈ నెల 10 వరకు నామినేషన్‌లు స్వీకరిస్తారు.

ఈ నెల 30న పోలింగ్‌ జరుగనుండగా, డిసెంబర్‌ 3న ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాల్లో ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్‌లు స్వీకరించనున్నారు.

నామినేషన్లను ఆన్‌లైన్‌లో పూర్తిచేసి ఆ దరఖాస్తును రిటర్నింగ్‌ అధికారికి భౌతికంగా సమర్పించాల్సి ఉంటుంది.

నామినేషన్ల పరిశీలన నవంబర్ 13న‌, నామినేషన్ల ఉపసంహరణ నవంబర్ 15, పోలింగ్‌ తేదీ నవంబర్ 30న ఉదయం 7 గం.ల నుంచి 5 గం.ల వరకు, 13 నక్సల్స్‌ ప్రభావిత స్థానాల్లో సా.4 గం వరకే పోలీంగ్ నిర్వ‌హించ‌నున్నారు.

ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3తో ఫ‌లితాలు వెల‌వ‌డ‌నున్నాయి.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *