సిద్దిపేట జిల్లా: అక్టోబర్ 20
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి
గజ్వేల్: శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో అన్ని ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఏ ఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్ తెలిపారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం ఏ ఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్,గజ్వేల్ ఏసిపి రమేష్ తో కలిసి గురువారం గజ్వేల్ పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ కార్యాలయ భవనలో స్ట్రాంగ్ రూమును పరిశీలించారు.





