Breaking News ఆధ్యాత్మికం

శ్రీదుర్గా మాత వద్ద మహా చండీ యాగం -పాల్గొన్న ప్రజాప్రతినిధులు ,

324 Views

శ్రీ దుర్గా మాత వద్ద మహా చండీ యాగం
-హాజరైన ప్రజాప్రతినిధులు

, ఎల్లారెడ్డిపేట :

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పశువుల అంగడి బజార్లో శ్రీ దుర్గా మాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్టించబడిన శ్రీ దుర్గా మాత మంటపం వద్ద ఐదవ వార్షికోత్సవం సందర్భంగా గురువారం మొదట గణపతి పూజ , చండీ హోమం, చండీ హావనం , పారాయణం వేదపండితులు బ్రహ్మశ్రీ రాచర్ల దయానంద్ శర్మ ఆద్వర్యంలో భారత రాష్ట్రపతి అవార్డు గ్రహీత హైదరాబాద్ కు చెందిన సంస్క్రిట్ డాక్టరేట్ రంగి సత్యనారాయణ శర్మ , రాచర్ల కృష్ణ మూర్తి శర్మ , వేణుగోపాల చార్య లు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక విశేష పూజా తదితర కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు , చండీ హోమం లో ఎనిమిది మంది దంపతులు పాల్గొన్నారు.శరన్నవరాత్రి ఉత్సవాల్లో బాగంగా అమ్మవారు భక్తులకు గురువారం శ్రీ మహా చండీ దేవి అవతారంలో దర్శన మిచ్చారు, విగ్రహ మండపం దగ్గర ఉదయం రాత్రి పలు రకాలైన విశేష పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నట్లు నిర్వాహకులు శ్రీ రామోజీ ప్రవీణ్ పేర్కొన్నారు.భారత రాష్ట్రపతి అవార్డు గ్రహీత హైదరాబాద్ కు చెందిన సంస్క్రిట్ డాక్టరేట్ రంగి సత్యనారాయణ శర్మ శ్రీ మహాచండీ అమ్మవారిని ఆరాధించడం వల్ల జరుగు ప్రయోజనాలు అద్భుత విషయాల గురించి భక్తులకు వివరించారు, భక్తులను భక్తి మార్గంలో తన్వయత్వం చందేటట్టు బోధిస్తున్న తన ఆధ్యాత్మికత భక్తులను విశేషంగా ఆకర్షించింది, అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు.అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించగా సుమారు 1500 మందికి పైగా అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అమ్మవారిని స్థానిక ప్రజా ప్రతినిధుల, బిఆర్ఎస్ పార్టీ, బిజెపి పార్టీ నాయకులు దర్శించుకుని శ్రీ దుర్గా మాత కృపకు పాత్రులు అయ్యారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *