మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం
అక్టోబర్ 14
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రానికి చెందిన గౌరోల్ల రాజవ్వ 85 సంవత్సరాలు కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. శనివారం ఈ విషయం తెలుసుకున్న మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మర్కుక్ కర్ణాకర్ రెడ్డి మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి 5000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. పరామర్శించిన వారిలో సర్పంచ్ భాస్కర్,ఆత్మకమిటి డైరక్టర్ సంతోష్ రెడ్డి,బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మోర్సు శ్రీనివాస్ రెడ్డి, తదితరులు ఉన్నారు.





