Breaking News

దేశంలో పరిణామాలు, విశ్లేషణ అంశంపై సెమినార్…… రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఐ కార్యదర్శి గుంటి వేణు

145 Views

హైదరాబాదులో జరుగుతున్న సిపిఐ 24వ జాతీయ మహాసభలను పురస్కరించుకొని, రాష్ట్రంలోని మేధావులు, రచయితలు, కవులతో సిపిఐ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో దేశంలో పరిణామాలు- మేధావుల విశ్లేషణ” అనే అంశంపై సెమినార్ 2022 అక్టోబర్ 7న ఉదయం 11 గంటలకు సిపిఐ రాష్ట్ర కార్యాలయం, మగ్దూం భవన్, హిమాయత్ నగర్, హైదరాబాదులో జరుగుతుందని జిల్లా సీపీఐ కార్యదర్శి గుంటి వేణు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సెమినార్ ను సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి ప్రారంభిస్తారని ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్ , ప్రజాపక్షం దినపత్రిక సంపాదకులు కె.శ్రీనివాస్ రెడ్డి, ప్రముఖ పాత్రికేయులు మల్లేపల్లి లక్స్మయ్య, టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం , , ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు డి.పాపారావు, ప్రొఫెసర్ ఖాసీం , ప్రజాకవి గద్దర్ , ప్రజా వాగ్గేయ కారులు గోరెటి వెంకన్న , ఐప్సో సమన్వయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.ఎల్ , అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాపోలు సుదర్శన్ వక్తలుగా తమ విశ్లేషణలను సెమినారలో తెలిపారు . సిపిఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వామపక్ష అభిమానులు శ్రేయోభిలాషులు, హాజరై ఈ సెమినార్ విజయవంతం చేయాల్సిందిగా అయన కోరారు.

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్