కుత్బుల్లాపూర్:అక్టోబర్ 3
24/7 తెలుగు న్యూస్
ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ బస్తీలు, కాలనీలకు చెందిన ప్రజలు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఎమ్మెల్సీ మాట్లాడుతూ సంబంధిత అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ క్రమంలో గ్రామంలోని ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.





