కథనాలు

ఎస్ సి ఉపకులాల ఆత్మగౌరవ సభ గోడ పత్రిక ఆవిష్కరణ

247 Views

 

 

ఎస్ సి 57 ఉపకులాల సమస్యల సాధన కోసం అక్టోబర్ 4న జరిగే ఎస్ సి ఉపకులాల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని ఎస్ సి ఉపకులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బైరి వెంకటేశం మోచి పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్ పట్టణంలోని డాక్టర్ బి ఆర్. అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం వద్ద ఆత్మగౌరవ సభ గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ దోభిఘాట్ గ్రౌండ్ కాంటోన్మెంట్ లో జరిగే ఈ సభకు ముఖ్య అతిధిగా డాక్టర్ బి ఆర్.అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ గౌరవ అతిధిగా కొమురం భీమ్ మనవడు సోనేరావ్ భీమ్ విచ్చేస్తున్నారని ఎస్ సి ఉపకులాల చరిత్ర లో మొదటిసారి నిర్వహిస్తున్న ఈ సభకు రాష్ట్ర నలు మూలల నుండి ప్రతి ఇంటి నుండి ఉపకులాల ప్రజలు వేలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో ఎస్ సి ఉపకులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు నిరగొండ బుచ్చన్న గోసంగి, రాయిల లక్ష్మీనర్సయ్య చిందు, బక్కూరి పవన్ ద్యావతి, టీయన్.స్వామి మిత అయ్యాల్వర్, డి.రంగన్న మదాసికురువ, తులసిదాస్ గైక్వాడ్ మాంగ్, కురువ బాలరాజు, లేదర్ వర్క్ ఫెడరేషన్ అధ్యక్షులు చంద్రగిరి సత్యనారాయణ మోచి, కర్నె రామారావు డక్కలి, మార శంకర్ మాల మాష్టి, పర్శపాక శ్రీనివాస్ మాదిగ దాసు, నాయకులు టంటం అంబదాస్ హోలియదాసరి, త్రికోవెల బిక్షపతి, గడ్డం చిరంజీవి, బలరాం తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Prabha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *