సమాచర హక్కు చట్టం-2005 కోసం కృషి చేస్తున్న కార్యకర్తలకి రక్షణ కల్పించాలి
సెప్టెంబర్ 19 కొమురం భీం ఆసిఫాబాద్
కొమురం భీం ఆసిఫాబాద్ హక్కు చట్టం-2005 కార్యకర్తలకి రక్షణ కల్పించాలని మరియు వాంకిడి మండల పరిధిలో గల కొత్తగా ప్రారంభమైన పోలీస్ స్టేషన్లో సమాచార హక్కు చట్టం-2005 బోర్డు ఏర్పాటు చేయాలనీ కోరుతూ వాంకిడి మండల ఎస్సై సాగర్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్బంగా సమాచార హక్కు చట్టం-2005 కోమరంభీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు జాడి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ పోలీసు శాఖ వారు స.హ.చట్ట-2005 కార్యకర్తలకు రక్షణ కల్పించాలని కోరారు మరియు సమాచార హక్కు రక్షణ చట్టం-2005 బలోపేతానికి కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆర్,తిరుపతి జిల్లా జనరల్ సెక్రెటరీ, చునార్కర్ అరుణ్ జిల్లా వైస్ ప్రెసిడెంట్,రాజేష్ వాంకిడి మండల ప్రెసిడెంట్ పాల్గొన్నారు.
