దసరా కానుకగా స్కూల్ పిల్లలకు అల్పాహార పథకం ప్రారంభం: సీఎం కేసీఆర్.
హైదరాబాద్ :సెప్టెంబర్ 16
తెలంగాణలో విద్యావ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు విద్యార్థుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ప్రభుత్వం మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుకునే స్టూడెంట్స్ కోసం అల్పాహార పథకం ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు
దసరా కానుకగా అక్టోబర్ 24 నుంచి ఈ పథకాన్ని అమలు చేయనున్నారు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది.
