Breaking News ప్రకటనలు ప్రాంతీయం

న్యూ రెడ్డి ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు , బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య,

204 Views

న్యూ రెడ్డి ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో
పాల్గొన్న జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు ,
బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య,
ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ /ఎల్లారెడ్డిపేట

ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి లో న్యూ రెడ్డి ఫ్యామిలీ రెస్టారెంట్ సోమవారం ప్రారంభమైంది,
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మారావు , బిఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, పాల్గొన్నారు,
ఈ సందర్భంగా జెడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా ఎల్లారెడ్డిపేట మండల వినియోగదారులకు తాజా రుచికరమైన బోజనాలతో ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఫ్యామిలీ రెస్టారెంట్ ను ప్రారంభించిన రెస్టారెంట్ నిర్వహాకులు చంద్రమోహన్ రెడ్డి, తిరుపతి రెడ్డి లను వారు అభినందించారు,
ఎల్లారెడ్డిపేట రాచర్ల గొల్లపల్లి గ్రామాల మధ్య కామారెడ్డి సిరిసిల్ల ప్రదాన రహదారిలో న్యూ రెడ్డి ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హారి , సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, బొప్పాపూర్ సర్పంచ్ కొండాపూర్ బాల్ రెడ్డి, తిమ్మాపూర్ సింగిల్ విండో ఉపాధ్యక్షులు బుగ్గ కృష్ణమూర్తి శర్మ,, రాజన్న సిరిసిల్ల జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు చిదుగు గోవర్ధన్ గౌడ్, బిఆర్ ఎస్ పార్టీ ఎల్లారెడ్డిపేట పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, గొల్లపల్లి మాజీ సర్పంచ్ శ్రీ నివాస్ యాదవ్, బిఆర్ ఎస్ పార్టీ నాయకులు పిల్లి కిషన్, ఎలగందుల నరసింహులు, జర్నలిస్టులు జగదీష్ , దేవరాజు , భాస్కర్, శేఖర్ , కిషోర్, తదితరులు పాల్గొన్నారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *